Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు అందర్నీ కలేసికొడతారు : కేఈ కృష్ణమూర్తి

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతరించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టి తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇంకేమైనా ఉందా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి

Webdunia
ఆదివారం, 26 ఆగస్టు 2018 (17:08 IST)
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవతరించిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టి తిరిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఇంకేమైనా ఉందా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఒక వేళ పొత్తంటూ పెట్టుకుంటే ప్రజలు తిరగబడి అందర్నీ కలేసికొడతారంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
 
ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. టీడీపీ జాతీయ పార్టీ అని, ఇతర రాష్ట్రాల్లో పొత్తులు ఏవిధంగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో మాత్రం పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. 
 
కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తాను చేసిన వ్యాఖ్యలపై ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య స్పందించడపై కేసీఆర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ల ఎవరు తనకు చెప్పడానికి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారన్నది తమ మనసులలో నాటుకుపోయిందని, కింది స్థాయి కేడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలనే తాను వెల్లడించానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments