Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పెళ్లైంది.. ఇక వద్దని మొత్తుకున్నా.. వినలేదు.. చంపేసింది..

మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘ

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:33 IST)
మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. 
 
తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమం ఆగస్టు 14వ తేదీన రాత్రి విజయుడు ఆ మహిళ ఇంటికెళ్లిన విజయుడు.. తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. 
 
కోపంతో ఆ మహిళ రోకలిబండతో విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు కత్తితో దాడి చేసింది. ఆపై భయంతో ఇంటికి తాళం వేసి పారిపోయింది. చివరికి బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments