Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆళ్లగడ్డ జిల్లా కోర్టు సంచలన తీర్పు! అయిదుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (14:07 IST)
క‌ర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో 2013లో జరిగిన హత్య కేసులో ఆళ్లగడ్డ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భీమునిపాడు గ్రామానికి చెందిన దుత్తల నరసింహారెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి డి. అమ్మన్నరాజా నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. 
 
2013వ సంవత్సరం మే 10 న కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామానికి చెందిన దుత్తల నరసింహారెడ్డి, వీరారెడ్డి లు మోటార్ సైకిల్ మీద నంద్యాల నుంచి భీమునిపాడు కు వస్తుండగా, రేవనూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కలుగొట్ల గ్రామ సమీపంలో ప్రత్యర్ధులు బొలెరో వాహనంతో వెనకవైపు నుంచి వారు ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ ను ఢీ కొట్టారు. అనంతరం దుత్తల నరసింహారెడ్డి ని కత్తులతో నరికి చంపారు. ఈ కేసుకు సంబంధించి రేవనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మొత్తం ఏడు మంది పై పోలీసులు కేసు నమోదు చేయగా ఆరికట్ల రామసుంకి రెడ్డి కి ఈ కేసుతో సంబంధం లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆరు మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. 
 
కేసు విచారణ దశలో సుధీర్ రెడ్డి అనారోగ్య కారణంతో మృతి చెందాడు. దీంతో హత్య కేసులో ఉన్న ఆరికట్ల చిన్న సుంకిరెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, సుబ్బరాయుడు, బాలస్వామి లపై నేరం రుజువు కావడంతో ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.అమ్మన్న రాజా సోమవారం ఐదు మంది ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష అలాగే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. అనంతరం ముద్దాయిలను ఆళ్లగడ్డ సబ్ జైల్ కి తరలించారు. ఐదు మంది కి జీవిత ఖైదు విధించడంతో భీమునిపాడు గ్రామంలో ఎటువంటి ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments