వైకాపా నేతలను వేటకొడవళ్లతో నరికేసిన బీజేపీ నేతలు

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (15:45 IST)
ఏపీలోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు జరిగాయి. వైకాపాకు చెందిన ఇద్దరు నేతలను భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు చంపేశారు. వేటకొడవళ్ళతో వేటాడి మరీ హత్య చేశారు. ఈ జంట హత్యలు జిల్లాలోని కౌతల మండలం కామవరం అనే గ్రామంలో జరిగాయి. 
 
వైకాపాకు చెందిన శివప్ప, ఈరన్నలతో బీజేపీకి చెందిన మల్లిఖార్జునకు ఓ భూవివాదం ఉంది. వీరిలో శివప్ప వర్గం వైకాపాలో, మల్లిఖార్జున వర్గం బీజేపీలో ఉన్నారు. అయితే, భూగొడవ విషయంలో మాట్లాడేందుకు గురువారం ఉదయం ఇరు వర్గాలు సమావేశమయ్యాయి. 
 
ఈ సమావేశం కాస్త రసాభాసగా మారింది. చివరకు ఘర్షణకు దారితీసింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మల్లిఖార్జున వర్గం నేతలు శివప్ప, ఈరన్నలపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కామవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments