Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అడుగు గుంటూరు యాజలి నుంచి మొదలైంది... లక్ష్మీ నారాయణ

తన అడుగు గుంటూరు జిల్లా యాజలి రైతుల వద్ద నుంచి ప్రారంభమైందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా యాజలిలో ఆయన మాట్లాడుతూ... రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని మహారాష్ట్ర సర్కారుని కోరినట్లు తెలిపారు. ఐతే తను చేసింది ఐపీఎస్‌

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (19:29 IST)
తన అడుగు గుంటూరు జిల్లా యాజలి రైతుల వద్ద నుంచి ప్రారంభమైందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. గుంటూరు జిల్లా యాజలిలో ఆయన మాట్లాడుతూ... రైతుల అభివృద్ధికి కృషి చేసే ఉద్యోగం కావాలని మహారాష్ట్ర సర్కారుని కోరినట్లు తెలిపారు. ఐతే తను చేసింది ఐపీఎస్‌ కాబట్టి  ప్రభుత్వం తనకు ఆ అవకాశం కల్పించలేదని చెప్పారు. అందువల్ల ఇక ఉద్యోగాన్ని వదిలేసి రైతులకు సేవ చేసుకునేందుకు బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. 
 
విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు నవ్వుతూ బదులిస్తూ... వ్యవసాయ మంత్రినైతే రైతులకు ఎలా సాయం చేయవచ్చో తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు అన్నారు. నార్వే వంటి చిన్నచిన్న దేశాల్లో రైతులు బాగా ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారనీ, అక్కడ రైతులు మేలురకమైన గింజలను సేకరించి నిల్వ చేసి ఇతర దేశాలకు సరఫరా చేసే స్థాయిలో వున్నదన్నారు. మన రైతులు కూడా ఇలాంటివాటిపై దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చారు. 
 
మన రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులను వాడుతుంటారనీ, వాటిని ఎంత తక్కువగా వాడితే అంతమంచిదనీ, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్నారు. కాగా లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై సస్పెన్స్ నెలకొని వుంది. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఇప్పటికే ఊహాగానాలు మొదలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments