Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమయ్యా... చంద్రబాబూ, ఇలా చేశావేందయ్యా...? 'అత్త' లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (18:11 IST)
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి లేదు.. జయంతి లేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం నేరుగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. మీ గౌరవాన్ని, మీ పేరును చెడగొట్టేందుకు అల్లుడు చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నాడంటూ ఒక పేజీ లెటర్ రాసి ఘాట్ వద్ద ఉంచింది లక్ష్మీపార్వతి. గంటపాటు మౌనంగా కూర్చుండి పోయింది. ఆ తరువాత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు.
 
నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. ప్రజలను మోసగించడం.. నెరవేరని హామీలివ్వడం.. వెన్నుపోట్లు పొడవడం ఇలా ఒకటేమిటి. అన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన వ్యక్తి ఆత్మ క్షోభించేలా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసినందుకు సంతోషపడేవారని బాబు చెప్పడం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
 
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని చంద్రబాబు ఏ విధంగా కాంగ్రెస్‌తో స్నేహం చేస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు అలా అయిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments