Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ద్రోహానికి నాయకులు... నటుడు శివాజీ

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:52 IST)
ప్రముఖ నటుడు శివాజీ.. పారిశ్రామికవేత్త మెగా కృష్ణారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఆయన దేశ ద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదుల చేశారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేర్లతో ప్రజా ధనాన్ని దోచుకొని ముఖ్యమంత్రులు పంచుకుంటున్నారంటూ ప్రముఖ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి ఈ వీడియోను విడుదల చేసే ధైర్యం తనకు ఉన్నా, దాన్ని ప్రసారం చేసే ధైర్యం రెండు రాష్ట్రాల్లోనే కాక, దేశంలో ఏ మీడియాకు లేదంటూ వ్యాఖ్యానించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలతో బస్సులను కొని దాంతో వచ్చే డబ్బులతో సొంత జేబులు నింపుకుంటున్నారని రాజకీయ నాయకులనుద్దేశించి అన్నారు.

ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్ట్​లోనూ అనేక అవకతవకలు జరిగాయనీ, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు త్వరలోనే బయటపెడతానని శివాజీ వెల్లడించారు. మెగా కృష్ణారెడ్డి కారణంగా భాజపాకు చెడ్డ పేరు వస్తోందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Toxic Torture reson: టాక్సిక్ చిత్రం టార్చెర్ కు కారణం ఏమిటి ? రుక్మిణి వసంత్ పాత్రపై చర్చ

Varanasi rumors: వారణాసి ని మరిచిపోకుండా వదంతులతో ప్రచారం చేస్తున్నారా ?

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

తర్వాతి కథనం
Show comments