Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగారూ... లీకేజీ చిన్నదే కానీ ప్యాకేజీ ఎంతో చెప్పండి... ఆళ్ల

అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 100

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:23 IST)
అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే లీకులా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
మంత్రి నారాయణ ఇదేదో చిన్న విషయమనీ, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సహేతుకంగా లేదన్నారు. లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలన్నారు. అమరావతి సచివాలయంలో ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చాంబరులోకి నీళ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇప్పుడు ఏకంగా మంత్రుల చాంబర్లకే చిల్లులు పడి నీళ్లు కారుతుంటే మంత్రిగారికి అది చిన్న విషయం అనిపిస్తుందనీ, అమరావతి సచివాలయంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments