Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో సెప్టెంబ‌రు 11న లోక్ అదాల‌త్

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (14:52 IST)
గుంటూరు జిల్లాలో ప‌లు కేసులు పెండింగ్ ప‌డిపోతున్నాయ‌ని, వాటి ప‌రిష్కారానికి మ‌రోసారి లోక్ అదాల‌త్ ఏర్పాటు చేస్తున్నామ‌ని జిల్లా న్యాయమూర్తి కె. రత్నకుమార్ చెప్పారు. గుంటూరులో జిల్లా న్యాయ‌మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, వివరాలు తెలియ‌జేశారు.

పెండింగులో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సెప్టెంబర్ 11న మరోసారి లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 20 నుండి 25 బెంచ్ లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. కోర్టుకు హాజరు కాలేని పరిస్థితుల్లో డిజిటల్, వ‌ర్చువల్ విధానం ద్వారా సంప్రదించే అవకాశం కూడా ఉందని తెలిపారు. గత లోక్ అదాలత్ లో 2,266 కేసులను పరిష్కరించామేని, ఈసారి అంతకన్నా ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తామ‌న్నారు. సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ సమస్యలు, స్థలాల సమస్యల వంటి కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాల‌న్నారు.

రెండు లక్షల లోపు చెక్ బౌన్స్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామ‌ని తెలిపారు. ఒక్కసారి లోక్ అదాలత్ లో సమస్య పరిష్కారం అయితే, అదే తుది తీర్పుగా పరిగణించబడుతుంద‌ని, ఇందులో ఎవ్వరూ ఓడినట్లు కాద‌న్నారు. గుంటూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకొని తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాల‌ని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments