Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్‌ కు లోకేష్ హెచ్చ‌రిక

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (09:43 IST)
రెండేళ్ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో అరాచ‌కాలు, విధ్వంసాలే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శలు గుప్పించారు. ఇటీవ‌ల ఎన్నికైన గ్రామ స‌ర్పంచ్‌లు అభివృద్ధి ప‌నులు ప్రారంభిస్తామంటే, వైసీపీ మూక‌లు దాడుల‌కు తెగ‌ప‌డుతున్నాయని మండిపడ్డారు.

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు స‌ర్పంచ్ అనూరాధ చెరువు మ‌ర‌మ్మ‌తుల ప‌నులు ఆరంభానికి ప్ర‌య‌త్నించ‌గా, వైసీపీ నాయకులు శివ గ్యాంగ్‌ అడ్డుకున్నారని... స‌ర్పంచ్ భ‌ర్త సోమ‌శేఖ‌ర్‌, అత‌ని అనుచ‌రుల‌పై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచి, అంతుచూస్తామ‌ని హెచ్చ‌రించ‌డం వైసీపీ అరాచ‌కాల‌కు అద్దం ప‌డుతోందన్నారు.

గ్రామంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం సృష్టించిన వైసీపీ నేత‌ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌క‌పోవ‌డం అన్యాయమని తెలిపారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులపై ప‌డిన ప్ర‌తీ దెబ్బ‌కి మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దని హెచ్చరించారు. మూడేళ్ల‌లో మూర్ఖ‌పురెడ్డి పాల‌న‌కి మూడిపోతుందన్నారు. అంద‌రి ఖాతాలు సెటిల్ చేస్తామని చెప్పారు.

గ్రామంలో మ‌నుషుల్లా, మాన‌వ‌త్వంతో మెలిగితే అదే గౌర‌వం ద‌క్కుతుందని హితవుపలికారు. అధికారం అండ ఉంద‌నే అహంకారంతో అరాచ‌కాల‌కు తెగ‌బ‌డితే...రెండింత‌లు తీసుకునేందుకు సిద్ధంగా వుండండి అంటూ లోకేష్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments