Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:12 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభంకానుంది. రాజమండ్రిలో జరిగిన టీడీపీ మహానాడు కారణంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు పాదయాత్రను వాయిదా వేశారు. ఇపుడు నాలుగు రోజుల విరామం తర్వాత ఆయన మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభించారు.
 
కాగా, ఆయన తన పాదయాత్రను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చేశారు. మే 30వ తేదీ మంగళవారం నుంచి జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆయన పాదయాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి. 
 
ఇప్పటివరకు మొత్తం 111 రోజుల పాటు పాదయాత్ర జరుగగా నారా లోకేశ్ నడిచిన మొత్తం దూరం 1423.7 కిలోమీటర్లని తెలిపింది. మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యే పాదయాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు జమ్మలమడుగు క్యాంప్ సైట్ నుంచి మొదలై 4.20 గంటలకు పెద్ద పులుసు మోటు వద్ద స్థానికులతో మాటామంతీ. 
 
సాయంత్రం 4.30 గంటలకు సంజాముల మోటు వద్ద బహిరంగ సభ. యువనేత ప్రసంగం. 5.45 గంటలకు జమ్మలమడుగు పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ. 6.15 గంటలకు కన్నెలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం. 8.15 గంటలకు ధర్మవరం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ. 9 గంటలకు శేషారెడ్డి పల్లె పాలకోవా సెంటరులో స్థానికులతో మాటామంతీ. 9.30 గంటలకు దేవగుడి సుంకులాం దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments