Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కొలువుదీరిన మట్టి గణపతి...

అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (20:29 IST)
అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలోని మూడో బ్లాక్ క్యాంటీన్లో వినాయక చవితి వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
అయిదు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించి, శాస్త్రోక్తంగా భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహార శాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఈ నెల 19వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు వంకాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కేవీఎల్ కాళీకుమార్, ట్రెజరర్ కొండారెడ్డి, ప్రతాప్ రెడ్డి, వరాలు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments