Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి అంగీకరించలేదనీ రైలు కిందపడిన డిగ్రీ - ఇంటర్ విద్యార్థులు

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (12:19 IST)
తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమ జంట బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్‌, మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్‌ డిగ్రీ చదువుతుండగా, మయూరి ఇంటర్‌ చదువుతోంది. అయితే, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.  ఈ విషయాన్ని తమ కుటుంబ పెద్దలకు చెప్పారు. కానీ, వారు వారిద్దరి పెళ్లికి సమ్మతించలేదు.
 
దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ ప్రేమజంట.. ఒకరినొకకరు వేరుపడి జీవించలేక చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈపరిస్థితుల్లో శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments