Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పిచ్చోడు : ప్రియురాలు నో చెప్పిందనీ ఐటీ కంపెనీ ఎండీ సూసైడ్

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (09:58 IST)
ఇటీవలికాలంలో ప్రేమ విఫలం కారణంగా జరిగే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావడం, ప్రేమను నిరాకరించడం, తిరస్కరించడం వంటి సంఘటనలతో విసిగిపోయిన ప్రేమికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ ఐటీ కంపెనీ ఎండీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (27) అనే యువకుడు శ్రీ సాయితి టెక్ మల్టీనేషనల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేస్తున్నాడు. ఈయన అదే కంపెనీలో పని చేసే ఓ యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో తన ప్రేమ, పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ యువతి పెళ్లికి మాత్రం నో చెప్పింది. 
 
దీంతో తవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రెడ్డి తన చాంబర్‌లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన కంపెనీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై అమీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments