Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (17:07 IST)
వెస్ట్ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈ నెల 19వ తేదీన సాగి తులసి ఇంటికి 'పార్శిల్లో మృతదేహం డోర్ డెలివరీ' అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే.. తులసి ఆస్తిని కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్ వర్మ, అతడి ఇద్దరు భార్యలు కలిసి ఈ దారుణానికి పాల్పడగా, ఈ హత్యలో మూడో భార్య కుమార్తె అయిన.. పదేళ్ల బాలిక పాత్ర ఉన్నట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
పోలీసుల కథనం మేరకు.. శ్రీధర్ వర్మ తల్లిదండ్రులు కాళ్ల మండలం కోపల్లెలో చెరువులపై పనిచేస్తూ అక్కడే జీవిస్తుంటారు. అతడి మొదటి భార్య ఎలిజబెత్ రాణి గాంధీనగరులో ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రెండో భార్య రేవతికి పిల్లలు లేరు. ఆమెను మొగల్తూరులో ఉంచాడు. మూడో భార్యగా చెబుతున్న సుష్మకు పదేళ్ల కుమార్తె ఉంది. ఆమెను కాళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇంట్లో ఉంచినట్లు తెలిసింది. వీరితోపాటు రెండో భార్య రేవతి.. తన అక్క తులసి ఆస్తిని కాజేయాలని ప్లాన్‌ ఉండడంతోనే భర్తకు సహకరించేదని సమాచారం. 
 
మృతదేహాన్ని పార్శిల్ చేసి పంపిన వెంటనే శ్రీధర్ వర్మ పరారు కాగా, శ్రీధర్ వర్మే నిందితుడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతడి కోసం గాలించారు.  కొన్ని సీసీ కెమెరాల్లో కనబడినట్లుగా కనిపించి, ఆ రూట్లలో కాకుండా మరో రూట్లలో వెళుతూ పోలీసులను దారి మళ్లించాడు. నాలుగు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టిన అనంతరం కృష్ణా జిల్లా బంటుమిల్లి వద్ద పోలీసులకు దొరికేశాడు. 
 
విచారణలో భాగంగా నిందితుడు శ్రీధర్ వర్మను హత్య జరిగినట్లు బావిస్తున్న ఉండి మండలం వాండ్రం రహదారి వైపుకు గురువారం తీసుకువెళ్లారు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిని భీమవరం, ఆకివీడు, కాళ్ల, ఉండిలలో రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments