Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్ పేరుతో కేటుగాళ్ళు... ట్రిపుల్ ఐటీ విద్యార్థికి కుచ్చుటోపీ

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (12:01 IST)
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ ఆపద్బాంధవుడుగా కనిపించిన బాలీవుడ్ విలన్ నటుడు సోనూ సూద్. అనేక మందికి తనకు తోచిన విధంగా సాయం చేశారు. మనుషులకే కాదు.. ఏకంగా ప్రభుత్వాలకు సైతం ఆయన సాయం చేశారు. ఈ క్రమంలో ఆయన పేరుతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. 
 
శ్రీకాకుళం జిల్లాలో ఆయన పేరు చెప్పి ఓ నిరుపేద విద్యార్థి దగ్గర రూ.2 వేలు కాజేశారు. సంతబొమ్మాళికి చెందిన కొయ్యాన రాంబాబు అనే విద్యార్థి ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్నాడు. తండ్రి కొవిడ్‌తో చనిపోగా తల్లి పక్షవాతంతో మంచంపట్టింది. నిరుపేద కుటుంబం కావడంతో పూట గడవని పరిస్థితి.
 
ఆ యువకుడి పరిస్థితి వివరిస్తూ దాతలు సాయం చేయాలని మీడియాలో కథనాలు వచ్చాయి. సోమవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి రాంబాబుకి ఫోన్‌ వచ్చింది. తాను సోనూసూద్‌నని ఇంగ్లీషులో మాట్లాడుతూ పరిచయం చేసుకున్నాడు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకుని సాయం చేస్తానని నమ్మబలికాడు. సాయంత్రం రూ.3 లక్షలు ఖాతాలో వేస్తానని హామీ ఇచ్చాడు.
 
అయితే, ముందుగా జీఎస్టీ ఫీజు కింద రూ.12 వేలు, రిజిస్ట్రేషన్‌కు రూ.2 వేలు కట్టాలని చెప్పాడు. నమ్మిన రాంబాబు స్నేహితుడు సాయంతో ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌లో రూ.2 వేలు వేశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో బాధితుడు సంతబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments