Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండలి ఇప్పట్లో రద్దయ్యేలా లేదు... ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (10:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్ర హోంశాఖకు పంపించింది. ఆ తర్వాత ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండలి రద్దు అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల దృష్టికి తీసుకెళ్లారు. మండలి రద్దు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని విన్నవించారు. అయితే, కేంద్ర పెద్దల నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా లేదు.
 
దీంతో సీఎం జగన్ ఇతర ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులోభాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మండలిలో వైసీపీకి మెజార్టీ లేనందున... కలిసొచ్చే సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విశ్వసనీయ సమాచారం. టీడీపీ సభ్యులతో పాటు, మరికొందరిని కూడా తమ వైపు రావాలని అడుగుతున్నట్లు తెలిసింది. 
 
అలాగే, శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునే పనిలో ఆయన నిమగ్నమైవున్నట్టు వినికిడి. మొత్తంమీద తాను అనుకున్న పనిని సాధించేందుకు ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments