Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి జాతీయ రహదారిపై భారీ చోరీ, రూ.80 లక్షల విలువైన ఫోన్లు దోపిడీ

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (18:46 IST)
గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై భారీగా చోరీ జరిగింది. ఓ కంటెయినర్ నుంచి రూ.80 లక్షల  విలువగల మొబైల్ పోన్లను దుండుగలు చోరీ చేశారు. ఇందులో 980 మొబైల్ ఫోన్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లా శ్రీసిటీ సెజ్ నుంచి కొల్ కత్తాకు మొబైల్ ఫోన్లను కంటెయినర్లో తరలిస్తున్నారు.
 
ఆ కంటెయినర్ మంగళగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో ఓ వాహనదారుడు కంటెయినర్ వెనుక భాగం తెరిచి ఉన్నట్లు గుర్తించాడు. ఆ విషయాన్ని కంటెయినర్ డ్రైవర్‌కు తెలిపాడు. దాంతో వాహనన్ని ఆపిన డ్రైవర్ వెనుక భాగంలో పరిశీలించగా అందులో చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాజా టోల్‌గేట్ వద్ద కంటెయినర్‌ను నిలిపి మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఈ ఘటనపై వెంటనే స్పందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని తెలిపారు. ఇదే తరహా కొన్ని వారాల క్రితం చిత్తూరు జిల్లాలో కంటైనర్ నుంచి మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. వాటి విలువ రూ.10 కోట్లు అని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments