Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్మిక లోకానికి 'మే డే' శుభాకాంక్షలు: జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (23:07 IST)
అమ‌రావ‌తి: రేపు కార్మికుల దినోత్సవం 'మే డే' సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ పురోగతిలో, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో శ్రమజీవుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా అన్నారు. ఈ అభివృద్ధిలో శ్రామిక సోదరులు ధారపోసిన స్వేద జలానికి ఎంతని విలువ కట్టగలమని ప్రశ్నించారు.

కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి, పోరాడి సాధించిన రోజు 'మే డే' అని అన్నారు. తమ శ్రమను గుర్తించండని కష్ట జీవులు పోరాటానికి దిగే పరిస్థితి రాకూడదని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రమను గుర్తించాలని, అప్పుడే కార్మికుల కళ్లలో నిజమైన ఆనందాన్ని చూస్తామని అన్నారు.

కార్మిక లోకానికి, తన తరపున, జనసేన పార్టీ పక్షాన 'మే డే' శుభాంకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. పరిశ్రమల్లో, వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న వారి నుంచి అసంఘటిత రంగాల్లో ఉన్న వారందరికీ కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు కావాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని పవన్ తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో కార్మికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఆ కష్ట జీవుల కుటుంబాలను తక్షణం ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. ఆరోగ్యపరంగా వారికి అవసరమైన అన్ని సేవలను సక్రమంగా అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments