Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలకు వచ్చే వీఐపీలకు ఉపరాష్ట్రపతి సూచన... ఏంటది?

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు.

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:31 IST)
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు. 
 
ఆయన మంగళవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకున్న వెంకటేశ్వర స్వామి మీడియాతో మాట్లాడారు. ఒకసాధారణ పౌరుడిగానే స్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ.. వెంకన్న భక్తులు పెరుగుతున్నారని చెప్పిన వెంకయ్య.. వారందరికి దర్శనం అవకాశం సులభంగా కలగాలన్నారు.
 
వీఐపీలుగా చెలామణి అయ్యే నాయకులు పదే పదే తిరుమలకురావడం తగ్గించాలని కోరారు. స్వామి దర్శనానికి వీఐపీలు సంవత్సరానికి ఒకసారి వస్తే మిగతా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం సులభంగా కలుగుతుందన్నారు. ఇదే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ అధికారులకు చెప్పానన్నారు. మరొకరు ఇబ్బంది పడుతూ మనం సంతోషంగా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదన్నారు. 
 
కాగా, ఉపరాష్ట్రపతిగా మహాద్వారం నుంచి దర్శనానికి వెళ్ళాల్సి ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామి దర్శనానికి వెళ్లడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. క్యూలైన్‍లోనే వెళ్లి దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. వేంకటేశుడి ముందు అందరూ సమానులే, సామాన్యులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments