Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు: ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆది నారాయణరెడ్డి మండిప‌డ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని.

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (09:55 IST)
టీడీపీ మంత్రి భూమా అఖిలప్రియ వస్త్రధారణపై విమర్శలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి ఆది నారాయణరెడ్డి మండిప‌డ్డారు. రోజాలాంటి వారు వస్త్రధారణపై మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని... బట్టలు లేకుండా తిరిగే వాళ్లకు వస్త్రధారణపై మాట్లాడే అర్హత లేదని సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆది నారాయణ రెడ్డి దళితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దళితులు శుభ్రంగా ఉండరు.. సక్రమంగా చదువుకోరు.. వారు అభివృద్ధి చెందక పోవడానికి వారే కారణమంటూ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి కామెంట్లు చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రి అభివృద్ధి అంశంపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దళితులు మారలేదన్నారు. రాజ్యాంగంలో అంబేద్కర్‌ దళితులకు పదేళ్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికి 70 ఏళ్లు దాటినా వారిలో ఎటువంటి మార్పు రాలేదని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
 
దళితులు అభివృద్ధి చెందకపోవడానికి దళితులే కారణమని.. వారి భూములకు పట్టాలుండవు. వారు బాగు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు. అందుకే వారే ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారని దళితులను కించపరిచారు. ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments