Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిడిపి నాయ‌కులు ద‌ద్ద‌మ్మ‌లు: మంత్రి వెలంప‌ల్లి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:51 IST)
ఐదు సంవ‌త్ప‌రాలుగా న‌గ‌రాన్ని అభివృద్ది చేయ‌కుండా విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌ను మోసం చేసింది చంద్ర‌బాబు నాయుడు అని, జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత న‌గ‌ర అభివృద్దికి బాట‌లు ప‌డ్డాయ‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో స్వాతి సెంట‌ర్ వ‌ద్ద క్యాంబే రోడ్డు మ‌రియు  గాంధీ బొమ్మ సెంట‌ర్‌లో దాదాపు 4కోట్లు రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నుల‌కు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస రావు శుంకుస్థాప‌న చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు సంవ‌త్స‌రాలు జ‌లీల్ ఖాన్‌, బొండా ఉమా, గ‌ద్దె రామ్మెహ‌న‌రావు, ఎం.పి కేశినేని నాని విజ‌య‌వాడకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేని ద‌ద్ద‌మ్మ‌లు అన్నారు.

టిడిపి ప్ర‌భుత్వ‌ హ‌యంలో న‌గ‌ర అభివృద్ది ప‌ట్టించుకోని ఎం.పి.. ఇప్ప‌డు దుర్గ‌గుడి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడ‌టం హ‌స్య‌స్ప‌దంగా ఉంద‌న్నారు.

కృష్ణా పుష్క‌రాల‌కు దుర్గ‌గుడి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామ‌ని చెప్పిన ఎం.పి కేశినేని నాని ఇప్ప‌డు ప్ర‌జ‌ల‌కు ఏమి స‌మాధానం చేబుతార‌ని ప్ర‌శ్నించారు. 
 
4న దుర్గ‌గుడి పైవోర్‌తో పాటు బెంజిస‌ర్కిల్ పైవోర్‌, విజ‌య‌వాడ అవుట‌ర్ రింగ్ రోడ్డును కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ప్రారంభిస్తామ‌న్నారు. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత సంక్షేమం, అభివృద్దిని రెండు క‌ళ్లుగా న‌గ‌ర‌ అభివృద్దికి నిధులు మంజూరు చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments