Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిపుంజు కనిపించట్లేదు సార్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (15:31 IST)
పెంపుడు జంతువులపై చాలామంది ప్రేమ వుంటుంది. ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోతే వెతికిపెట్టాలని కొంతమంది ప్రకటనలు ఇచ్చిన దాఖలాల గురించి వినే వుంటాం. తాజాగా ఓ కోడిపుంజు చోరీకి గురైందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు చోరీ అయ్యిందంటూ.. లబోదిబోమంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు.  
 
తన తెల్ల కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నజాతి కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారని వాపోయాడు. గత నెల 29వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.  మూడు రోజుల క్రితం దొంగలు రూ. 9వేల విలువగల జాతి కోడిపుంజును ఎత్తుకెళ్లారు. 
 
గ్రామ పరిసరాల్లో కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు ఎత్తుకెళ్లారు అని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని ఫిర్యాదు చేయడం గమనార్హం. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై బిందుమాధవి మీడియాకు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments