Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాలెట్ పత్రాల్లో తప్పులు.. నిలిచిన పోలింగ్..ఎక్కడ?

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:29 IST)
గుంటూరు జిల్లాలోని గురజాల మండలం మాడుగులలో బ్యాలెట్ పత్రాల్లో తప్పులు రావడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇద్దరు అభ్యర్థులకు అధికారులు ఒకే గుర్తు ముద్రించారు.

దీంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది. తిరిగి ఈనెల 21న మాడుగులలో పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 
 
ఓటు వేయ కుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా?
ఓటు వేయ కుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా? ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా.. అని పాలకులపై టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు.

నరసరావుపేట నియోజకవర్గం గోగులపాడు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే కక్షతో ఇస్సపాలెంలో ఇళ్లలోకి వెళ్లే మెట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేసిన ప్రదేశాన్ని టీడీపీ ఉన్నత స్థాయి కమిటీ సందర్శించి బాధితులను పరామర్శించింది. జరిగిన సంఘటనను కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు.

అనంతరం వర్ల రమయ్య మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారని ఇలా నిర్మాణాలు కూల్చివేయడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే పేరుకే డాక్టర్‌ అని, ఆయనకు మానవత్వం లేదని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments