Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి వెయ్యికాళ్ల మండపం పడగొట్టి అనుభవించారు... రోజా(Video)

తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే వారెవరినీ వదిలిపెట్టనన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. వెయ్యికాళ్ళ మండపం నిర్మాణాన్ని ఎప్పటి లోగా పూర్తి చేస్తారో భక్తులకు టిటిడి చెప్పాలన్నారు. సాక్షాత్తు శ్రీ వేం

Webdunia
శనివారం, 16 జూన్ 2018 (20:37 IST)
తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించే వారెవరినీ వదిలిపెట్టనన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. వెయ్యికాళ్ళ మండపం నిర్మాణాన్ని ఎప్పటి లోగా పూర్తి చేస్తారో భక్తులకు టిటిడి చెప్పాలన్నారు. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వెయ్యికాళ్ళ మండపంలో కూర్చుని భక్తులను కటాక్షించేవారని పురాణాలు చెబుతున్నాయని, మండపాన్ని కూల్చిన తరువాత కొంతమంది ఎలాంటి ఇబ్బందులు పడ్డారో భక్తులకు తెలుసునని చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు రోజా. వెయ్యికాళ్ళ మండపం నిర్మాణం కోసం న్యాయపరమైన పోరాటం చేస్తానన్నారు. సైకిల్‌కు ఓటేస్తే ప్రజలకు వారికి వారే ఉరేసుకున్నట్లేనన్నారు. 
 
బంధుప్రీతి, కులప్రీతి, మతపిచ్చి పార్టీ తెలుగుదేశం మాత్రమేనని విమర్శించారు. ప్రధానమంత్రి ఎవరో, రాష్ట్రాన్ని విడగొట్టింది ఏ పార్టీయో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్‌ అని విమర్శించారు. చిత్తూరు జిల్లా అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో డ్రైనేజీ నీరు రోడ్డుపైకి వస్తోందని, వీటిని మరమ్మత్తులు చేయాల్సిన బాధ్యత టిటిడిపై ఉందన్నారు రోజా. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ను కలిసిన రోజా నగరి నియోజకవర్గంలో టిటిడి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. వీడియోలో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments