Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో టీకాల కొరతకు ప్రధాని మోడీ సర్కారే కారణం : ఆర్కే రోజా

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (13:16 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు కొరత ఏర్పడటానికి మోడీ సర్కారే కారణమని ఆమె ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా... హైదరాబాదులో కూర్చొని ప్రెస్మీట్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం దారుణమని మండిపడ్డారు. 
 
రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందలేదని... దీనికి ప్రధాని మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్ పంపించాలని ప్రధాని మోడీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని విమర్శించారు. 
 
రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం లేదన్నారు. విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేశ్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఆయన మాదిరే చవటలా తయారవ్వాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments