Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచెల భద్రను కల్పించారు. దీంతో అన్ని పార్టీలన్నీ అటెన్షన్‌లోకి వెళ్లిపోయాయి. 
 
ఈ ఓట్ల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లలో ప్రదర్శిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్న మునుగోడు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తికానుమంది. 
 
తుది ఫలితాన్ని 3 గంటలకు వెల్లడయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఓట్ల లెక్కింపు మాత్రం మధ్యాహ్నం 12 గంటలకే పూర్తికానుంది. కాగా, ఈ నెల 3వ తేదీన జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైన విషయం తెల్సిందే. మొత్తం 241805 ఓట్లకుగాను 225192 ఓట్లు పోలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments