Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు.. నాగబాబు హర్షం

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (17:39 IST)
ఏపీ రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. అమరావతిలో రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని నాగబాబు అన్నారు.
 
ఇది అమరావతి రైతులు, మహిళలతో పాటు ఆంధ్ర ప్రజల విజయమని నాగబాబు పేర్కొన్నారు. 800 రోజులకు పైగా ఎన్నో అవరోధాలు దాటుకొని మొక్కవోని దీక్ష చేసిన అమరావతి రైతుల దీక్ష ఫలించిందని నాగబాబు అన్నారు. 
 
గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుంది. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు అప్పగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని.. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు.  
 
అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదు. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు.. అంటూ హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments