Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అభ్యర్థి శిల్పాకు ఓటేసి గెలిపించండి.. 'నాగార్జున' ఫ్యాన్స్‌కు పిలుపు

కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి సినీ హీరోల అభిమానులు మద్దతు ప

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (06:46 IST)
కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డికి సినీ హీరోల అభిమానులు మద్దతు పలుకుతున్నారు. 
 
మొన్నటికిమొన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు పలకగా, ఇపుడు అక్కినేని నాగార్జున అభిమానులు అండగా నిలిచారు. ఎన్నికల్లో తాము శిల్పాకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామరాజు ప్రకటించారు. 
 
నాగ్ అభిమానులంతా శిల్పాకు ఓటేసి.. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా, శిల్పాకు సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేశ్‌ బాబు అభిమానులు మద్దతు ఇస్తారని నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల ఉప ఎన్నికలకు సినీ రంగు కూడా అంటుకుంది. 
 
భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఈనెల 23వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments