Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యాలయం వద్ద మ‌ళ్ళీ ఉద్రిక్తత... మూవ్... మూవ్ అంటూ లోకేష్!

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (16:29 IST)
ఏపీలో రాజ‌కీయ కొట్లాట‌లు శృతి మించుతున్నాయి. నిన్న మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌గా, నేడు మ‌ళ్ళీ అదే కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక ద‌శ‌లో టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోలీసులపై విరుచుకుప‌డ్డారు. టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. నిన్నటి దాడిలో గాయపడిన కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తల అంబులెన్స్ ని అడ్డుకున్న పోలీసులు వారిని కార్యాల‌యానికి రానివ్వ‌లేదు. త‌మ‌కు అయిన గాయాలు చూపించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తుండగా అడ్డగించారు. 
 
పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ర్యాలీగా వెళ్లిన లోకేశ్, టీడీపీ నేతలు ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాలు చేశారు. దీనితో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లోకేష్ ఒక ద‌శ‌లో పోలీస్ అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. త‌ప్పుకో... అడ్డులే... ఏం త‌మాషాలా అంటూ, పోలీసుల‌పై దూసుకెళ్ళారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల అంబులెన్స్ ను పోలీసుల దిగ్బంధం నుంచి విడిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments