Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్‌ డ్రాయర్లతో నడిరోడ్డుపై ఊరేగిస్తాం : వైకాపా నేతలకు నారా లోకేశ్ హెచ్చరిక

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:14 IST)
వైకాపా నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బహిరంగంగా గట్టి వార్నింగ్ ఇచ్చారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఒక్కొక్కడిని కట్ డ్రాయర్లతో నడి రోడ్డుపై ఊరేగిస్తామని హెచ్చరించారు. 
 
యువగళం పేరుతో తాను చేపట్టిన పాదయాత్రలోభాగంగా ఆయన టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై ఘాటుగా స్పందించారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే తాము సహనంతో ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యయుతంగా నడుచుకుంటున్నామన్నారు. వైకాపా సైకో మూకల్లాగే తాము కూడా తెగిస్తే రాష్ట్రంలో ఒక్క వైకాపా కార్యాలయం ఉండదని ఆయన హెచ్చరించారు. 
 
గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశామని వైకాపా నేతలు తెగ సంబరపడిపోతున్నారనీ, వారు దాడి చేసి ధ్వంసం చేసింది రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అని విమర్శించారు. అదేసమయంలో తమ పార్టీపై దాడి చేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మాకు పౌరుషం లేదనుకుంటున్నారా.. కట్ డ్రాయర్లతో నడి రోడ్లపై ఊరేగిస్తాం.. గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments