Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖనగరంలో డ్రగ్స్ ఇంజెక్షన్ల కలకలం..

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (12:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక తీర ప్రాంతంగా ఉన్న విశాఖ నగరంలో డ్రగ్స్ ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి. చిత్తుకాగితాల వ్యాపారం పేరుతో మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఆటోనగర్‌ సమీపంలోని యాదవ జగ్గరాజుపేటలో స్క్రాప్‌ వ్యాపారం చేస్తున్న మహేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. ఈయన మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
ఇదే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆటోనగర్‌ యాదవ జగ్గరాజుపేట సమీపంలోని అపెరల్‌ పార్క్‌ రోడ్డులోని ఓ స్క్రాప్‌ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా 35 మత్తు ఇంజెక్షన్లు, గంజాయి నింపిన సిగరెట్లు, కొంత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనికి సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోల్‌కతా నుంచి ఇంజెక్షన్లు తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పూర్తి విచారణ చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments