Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం : ఒకే గ్రామంలో 16 మందికి కరోనా

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టలు తెంచుకుంది. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు వైద్య సిబ్బంది, హెల్త్ వర్కర్ల నిర్లక్ష్యం కూడా ఈ వైరస్ వ్యాప్తికి ఓ కారణంగా నిలుస్తోంది. తాజాగా ఓ ఆర్ఎంపీ వైద్యుడు చేసిన నిర్లక్ష్యం వల్ల మరో 16 మందికి ఈ వైరస్ సోకింది. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలోని బట్లమాగుటూరు అనే గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆర్ఎంపీ వైద్యుడుగా పని చేస్తున్న ఓ వ్యక్తి ఈ గ్రామంలో అనేక మందికి వైద్యం చేస్తూ వచ్చాడు. అయితే, ఈయన వైద్యం చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామానికి వెళుతూ వచ్చేవాడు. 
 
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతూ వచ్చిన వైద్యుడికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా, అది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన వైద్యం చేసిన గ్రామస్తుల వెన్నులో వణుకు మొదలైంది. చివరకు ఈ వైద్యుడు కారణంగా 16 మంది గ్రామస్తులకు ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సెకండ్ కాంటాక్టర్‌ను గుర్తించే పనిలోపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments