Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొట్టికొట్టి ఓపిక నశించే కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్‌ కవర్లు కుక్కాడు.. బ్యూటీషియన్ పద్మ

బ్యూటీషియన్ పద్మ హత్యాయత్నం కేసులోని మిస్టరీ ఇపుడిపుడే వీడుతోంది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇపుడిపుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు ఆమె వద్ద కొద్దిసేపు విచారణ జరిపారు. ఈ

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (08:47 IST)
బ్యూటీషియన్ పద్మ హత్యాయత్నం కేసులోని మిస్టరీ ఇపుడిపుడే వీడుతోంది. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఇపుడిపుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు ఆమె వద్ద కొద్దిసేపు విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
 
ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన తీవ్ర వివాదంలో పద్మను నూతన్ కుమార్‌ విచక్షణ రహితంగా కొట్టినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో తన కుమార్తెకు కూడా ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ఫోన్ చేసి చెప్పినట్టు ఆమె మొదటి భర్త సూర్యనారాయణ కూడా మీడియాకు తెలిపాడు. 
 
అదేసమయంలో పద్మపై జరిగిన హత్యాయత్నంలో నూతన్ కుమార్‌ ఒక్కడే ఉన్నాడని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ హత్యాయత్నం ఘటనలో సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఉన్నట్లు వచ్చి ఊహాగానాలకు తెరపడింది. 
 
తొలుత నూతన్ కుమార్‌ తీవ్రంగా కొట్టిన దెబ్బలతో ఓపిక పూర్తిగా నశించిందని, ఆ తర్వాతే తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్‌ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది. సోమవారం పద్మ రెండు చేతులకు శస్త్రచికిత్సలు చేయటం, ఆపరేషన్‌ నిమిత్తం అనస్తీషియా ఇవ్వటంతో మత్తుతో ఉందని, నూతన్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మంగళవారం కుటుంబ సభ్యులు పద్మకు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments