Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమూల్ తో ఒప్పందం... మిగతా డెయిరీలను దెబ్బకొట్ట‌డానికి కాదు...

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:38 IST)
పాడి రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. అమూల్ పై విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మిగతా డెయిరీలను దెబ్బకొట్టడానికో, మూసేయించేందుకో అమూల్‌తో ఒప్పందం చేసుకోలేదని చెప్పారు.

ప్రభుత్వ ధర చూసి మిగతా సంస్థలు కూడా పాల ధరలు పెంచాయన్నారు. ప్రతి గ్రామ పరిధిలో మిల్క్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లీటర్ పాలకు అదనంగా రూ.5 నుంచి రూ.10వరకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. డెయిరీ వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వెయ్యి పశువులకు ఒక వైద్యుడిని నియమించామన్నారు.


మరోవైపు నాడు-నేడు కింద వెటర్నరీ నిర్మాణాలను ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. పశు సంపద ఆధారంగానే రాష్ట్ర పురోగతిని అంచనా వేస్తారన్నారు. సంగం సంస్థకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానివేనని తెలిపారు. న్యాయపరంగా మరింత ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పాడి రైతుల కష్టాన్ని ఎన్నో ఏళ్లపాటు దోచుకున్నారని మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని పాల సొసైటీని మ్యాక్స్ చట్టం కింద తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేశారన్నారు. పాడి రైతుల అభ్యన్నతికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments