Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరంతా కరెంట్ తీసి.. మీడియా కన్నుగప్పి...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:29 IST)
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అత్యంత గోప్యంగా హైదరాబాద్‌కు రలించారు. ఆమెను తరలింపునకు ముందు హైదరాబాద్ నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. 
 
ఈ హత్య కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఆమెను కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల పాటు ఉంచారు. అయితే, ఈ హత్య హైదరాబాద్‌లో జరగడంతో ఆమెను హైదరాబాద్ పోలీసులకు అప్పగించాలని భావించారు. ఇందుకోసం శిఖా చౌదరి ఎవరి కంటా కనిపించకుండా ఉండాలా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
సోమవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు. ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. 
 
ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments