Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా క్వారంటైన్ సెంటర్‌లలోనూ మహిళలను వదలని కామాంధులు

Webdunia
గురువారం, 21 మే 2020 (20:53 IST)
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారు. కరోనా సోకి హాస్పిటల్‌లలో క్వారంటైన్ కోసం చేరిన వారికి కామంతో కళ్లుమూసుకుపోయాయి. వివరాలలోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న మహిళను కొంతమంది దుర్మార్గులు వేధింపులకు గురిచేసారు. కరోనా పాజిటివ్ రోగితో కాంటాక్ట్ నేపథ్యంలో కుమేరియా భటోలి గ్రామంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌లో అధికారులు ఓ మహిళను క్వారంటైన్‌లో ఉంచారు.
 
ఆమెపై కన్నేసిన ఇద్దరు కామాంధులు, ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను చూపించి, సదరు మహిళను లైంగికంగా వేధించారు. అంతటితో ఆగకుండా, ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే ఈ వీడియోని సామాజిక మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ భయంతో పోలీసులను ఆశ్రయించింది. 
 
పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించారు, అయితే అప్పటికే ఆ కామాంధులు వారి వద్ద ఉన్న వీడియోను డిలీట్ చేయడంతో, పోలీసులు మహిళ దగ్గర ఉన్న వీడియో ఆధారంగా, బాధితురాలికి వారు పంపిన సందేశాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసారు. క్వారంటైన్ సెంటర్‌లో సైతం మహిళను లైంగికంగా వేధించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం