Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిత్లీతో పంట దెబ్బతిందనీ ఒడిషా రైతు ఆత్మహత్య...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:21 IST)
తిత్లీ తుఫాను అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. అలాగే అపార నష్టాన్ని కూడా మిగిల్చింది. ముఖ్యంగా, రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఫలితంగా ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాలాహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెత్తే.. రైతు పేరు పరమానంద లహజల్ (26). భార్య నగలు తాకట్టు పెట్టి 35 వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు.
 
ఆ డబ్బుతో నాలుగు ఎకరాల పొలంలో పంట వేశాడు. అయితే, ఇటీవల తిత్లీ తుఫాను సృష్టించిన విధ్వంసానికి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. లహజల్ పంట వేసుకుంటే అప్పైనా తీరుతుందని భార్య నగలు పెట్టి మరి డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ, ఈ తుఫాన్ వలన అంతా నాశనమైపోయింది.
 
పంట నష్టం జరగడంతో లహజల్ రుణం చెల్లించలేక.. జీవితం భారంగా మారిందనే ఆవేదనతో విషం తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments