Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలు జారింది.. అంతే ఆ వృద్ధ దంపతులు మృతి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:07 IST)
కాలు జారింది.. అంతే ఆ వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. వృద్ధాప్యంలో కూడా ఒకరిపై ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడి ఎంతో ధైర్యంగా బతుకుతున్న వృద్ధ దంపతుల పట్టుదలను చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి నీటి ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడి వృద్ధ భార్యాభర్తలిద్దరూ మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇట్నేవారి పల్లె గ్రామానికి సమీపంలో ఉన్న వేరుశనగ పంటకు కాపలాగా ఉన్నారు వృద్ధ దంపతులు నారాయణ వెంకట రామనమ్మ . వేరుశనగ పంటకి దగ్గరలో ఒక నీటి గుంట ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరు వృద్ధ దంపతులు బట్టలు ఉతికేందుకు నీటి గుంట దగ్గరికి వెళ్ళారు.
 
ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలుజారి ఇద్దరు దంపతులు నీటి గుంటలో పడిపోయారు. చివరికి ఎవరు అటువైపుగా గమనించక పోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments