Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ వైరస్ భయం : కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసిన ఏపీ సర్కారు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:22 IST)
ఇపుడు ప్రపంచ ప్రజలకు ఒమిక్రాన్ వైరస్ భయం పట్టుకుంది. ఈ వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకుంటున్నారు. కొత్త ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. కేంద్ర హోం శాఖతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
ముఖ్యంగా, ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకుంటే రూ.100 అపరాధం విధించాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, మాస్కులు లేని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగమాల్లోకి అనుమతిస్తే యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
అలాగే, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సదరు వ్యాపార, వాణిజ్యం సంస్థలను రెండు రోజుల పాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ఐపీసీ 188 ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments