Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ వేసుకొమ్మన్నందుకు ఆమెను గొడ్డును బాదినట్లు బాదాడు, ఎక్కడ..?

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (14:23 IST)
అసలే కరోనా కాలం.. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సర్. మాస్క్ వేసుకోండి.. జాగ్రత్తగా ఉండండి అని సహ ఉద్యోగి చెప్పినందుకు ఉన్నతాధికారికి కోపమొచ్చింది. విచక్షణారహితంగా ఆ ఉద్యోగిని చితకబాదాడు. ఆసుపత్రి పాలు జేశాడు.
 
ఎపి టూరిజంలో నెల్లూరుజిల్లా డిప్యూటీ టూరిజం మేనేజర్ భాస్కర్, సహ ఉద్యోగి ఉషారాణిని ఈ నెల 27వ తేదీన చితకబాదాడు. ఆఫీస్‌కు వచ్చిన భాస్కర్‌ను... సర్ మాస్క్ వేసుకోండని ఉషారాణి చెప్పింది. కాంట్రాక్ట్ పని చేసే నువ్వు కూడా నాకు సలహాలిస్తావా అంటూ భాస్కర్‌ ఊగిపోతూ ఆమెపై చేయి చేసుకున్నాడు.
 
తన టేబుల్ పైన ఉన్న ఇనుప కడ్డీతో ఆమె తలపై బాదాడు. జుట్టు పట్టుకుని కిందకు తోశాడు. ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా దారుణంగా కొట్టాడు. ఉషారాణి దివ్యాంగురాలు. అయినా పట్టించుకోలేదు.
 
సహచర ఉద్యోగులు భాస్కర్‌ను పట్టుకుని పక్కకు నెడుతున్నా వినిపించుకోలేదు. ఆమెను చావబాదాడు. అయితే విషయం బయటకు రానివ్వకుండా మూడురోజుల పాటు జాగ్రత్తపడ్డాడు. అయితే ఈరోజు ఉదయం సి.సి. కెమెరా ఫుటేజ్‌ను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. న్యాయం కావాలని కోరుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments