Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతాం: సీఆర్పీఎఫ్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (13:03 IST)
కేంద్ర ప్రభుత్వం   మార్గదర్శకాల ప్రకారం  దేశ వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని సిఆర్పిఎఫ్ నిర్ణయించినట్లు రాజమహేంద్రవరం, లాలా చెరువు లోని సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రెండు వేల మొక్కలు నాటుతున్న ట్లు  సతీష్ కుమార్ తెలిపారు.

గురువారం రాజమహేంద్రవరం లోని ఆవ రోడ్డు లో ఉన్న వాంబే గృహాల లో సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీ.ఆర్. పి.ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్  మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది అంతా నిరంతరం  కొనసాగుతుందని తెలిపారు. ఈఏడాది ఆఖరు నాటికి సీ.ఆర్. పి.ఎఫ్ 42 బెటాలియన్ తరపున 10,000 మొక్కలు నాటు తామని పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే విధానాన్ని తమ  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు.  మొక్కలు నాటి వాటిని సంరక్షించి,  పెంచినట్లైతే  పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమీ డి డి ఎం. వి ప్రసాద్ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ డి.ఈ  ప్రసాద్, సిల్వి కల్చరిస్ట్ ఎల్.భీమయ్య,  సీలేరు, డొంకరాయి, చింతూరు, సిఆర్పిఎఫ్ బెటాలియన్. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments