Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘువీరా రెడ్డికి పవన్ అభినందనలు.. టైమ్ లేక రాలేకపోతున్నానని ట్వీట్.. కేవీపీ బాబును ఏకేశారు..

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అభినందనలు

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (13:55 IST)
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అభినందనలు తెలుపుతున్నానని పవన్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి, అన్ని పార్టీలు ఏకంకావాలన్నారు.

అలాగే గుంటూరులో నిర్వహిస్తున్న సభకు హాజరుకావాలంటూ పవన్ కల్యాణ్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. దీనిపై స్పందించిన పవన్... తగినంత సమయం దొరకకపోవడం వల్ల సభకు రాలేకపోతున్నానని తెలిపారు.
 
ప్రత్యేక హోదా కోసం గుంటూరు వేదికగా ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తోంది. అయితే ఈ సభకు వైసీపీ చీఫ్ జగన్, జనసేన ఛీప్ పవన్ కళ్యాణ్‌తో పాటు వివిద పార్టీల జాతీయనాయకులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కానీ ఈ సభ పట్ల టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రాన్ని విభజించి సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పేరుతో సభలు నిర్వహించడాన్ని తీవ్రత ప్పుబట్టింది.
 
కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ప్రత్యేక హోదా కోసం భరోసా పేరుతో నిర్వహించే సభకు వెళ్ళేవారంతా అభివృద్ది నిరోధకులేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. కాంగ్రెస్ సభకు ప్రజలు వెళ్ళకపోవడమే ఆ పార్టీని నిజమైన గుణపాఠమన్నారు. 
 
అయితే టీడీపీ విమర్శలను కేవీపీ తిప్పికొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రులను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. విభజన చట్టంలోని హమీలు సాధించుకొనే దమ్ము లేకనే కాంగ్రెస్‌పై సీఎం చంద్రబాబునాయుడు నిందలు వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎంపి కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వివిద పార్టీలకు చెందిన జాతీయ నాయకులు మద్దతిస్తున్నా చంద్రబాబు మాత్రం కళ్ళు తెరవడం లేదన్నారు. నాడు రెండు కళ్ళ సిద్దాంతం, నేడు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్రులను సీఎం నిలువునా మోసం చేస్తున్నారని కేవీపి ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments