Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షమించండి.. అప్పుడు విదేశాల్లో ఉన్నా.. రాలేకపోయా: పవన్

కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (14:49 IST)
కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని.. అందుకే రాలేకపోయానని.. క్షమించాలని బాధిత కుటుంబాలతో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే పడవ ప్రమాదం జరిగిందన్నారు. విహార యాత్రకు వెళ్తే విషాదం మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ప్రమాద బాధితుల బాధను అందరూ అర్థం చేసుకోవాలని.. ఎవరినీ నిందించేందుకు తాను రాలేదని పవన్ అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాస్త ఊరట నిచ్చేందుకే తాను ఇక్కడి వచ్చానని చెప్పుకొచ్చారు.

పడవ ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వారికి ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపరిహారం ఇచ్చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ పవన్ కల్యాణ్ నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments