Webdunia - Bharat's app for daily news and videos

Install App

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (10:03 IST)
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లోని సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ కోలుకున్నాడు. దీంతో అతన్ని తీసుకుని ఆదివారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. 
 
కాగా, అగ్నిప్రమాదంలో తన కుమారుడు గాయపడ్డాడని తెలియగానే పవన్ కళ్యాణ్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన సింగపూర్‌కు బయలుదేరి వెళ్లిన విషయం తెల్సిందే. అక్కడి ఆస్పత్రిలో చికిత్స తర్వాత మార్క్ శంకర్ కోలుకోవడంతో అతడితో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చారు. 
 
తన కుమారుడు మార్క్ శంకర్‌ను ఎత్తుకుని విమానాశ్రయం నుంచి పవన్ బయటకు వస్తున్న దృశ్యాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ వెంట ఆయన భార్య, కుమార్తె, జనసేన పార్టీ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్‌లు ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments