Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు విశాఖకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ - ప్రధాని మోడీతో భేటీ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (21:20 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విశాఖపట్టణ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం వైజాగ్ రానున్నారు. ప్రధానితో భేటీ అయ్యేందుకు పవన్ వైజాగ్ వెళుతున్నారు.
 
విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఒక రోజు పర్యటన నిమిత్తం వస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖకు వస్తున్న ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణఅ రేపు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
 
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి నేరుగా విశాఖకు చేరుకుంటారు. విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే ప్రధానితో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా వారు తాజా రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, శాంతిభద్రతల పరిస్థితులను ప్రధానికి ఆయన వివరించనున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా పవన్ రెండు రోజుల పాటు విశాఖలోనే ఉంటారు. అయితే, ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా హాజరువుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరువుతారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments