Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా గుండె కలచి వేసింది: పవన్‌ కళ్యాణ్‌

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (18:48 IST)
‘దళిత కులాల మీద దాడులు జరిగినా.. చెప్పడానికి భయపడుతున్నారు. మిగతా వారు.. ముఠాలు చెప్పింది మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధను వెళ్లబోసుకుంటే నా గుండె కలచి వేసింది’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. 
 
సోమవారం ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాతృభాషపై ప్రధాని వ్యాఖ్యల కథనాన్ని పోస్ట్‌ పవన్‌ చేశారు. కడప జిల్లాల్లో పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని ఆయన ట్వీట్‌ చేశారు.
 
ఇదే పుస్తకంలో 75వ పేజీలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రస్తావన కూడా ఉందన్నారు. 1996లో ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వస్తాయన్నారు.
 
రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారన్నారు.

ఈ ముఠా సంస్కృతి వల్ల రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుందన్నారు. రాయలసీమలో మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉందని జనసేనాని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments