Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యను అడ్డుకున్న ఖాకీలు - మా జోలికొస్తే తిరగబడతామంటూ వార్నింగ్

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (14:29 IST)
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చిలమత్తూరు మండలం కొడికొండ గ్రామంలో బాలయ్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఇక్కడ మూడు రోజుల క్రితం జాతర జరిగింది. ఆ సమయంలో వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. వైకాపా కార్యకర్తల దాడిలో టీడీపీ కార్యకర్త గాయపడ్డాడు. అతన్ని పరామర్శించేందుకు బాలయ్య ఆ గ్రామానికి వచ్చారు. 
 
కానీ, బాలయ్యను ఆ గ్రామానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు పోలీసులు దిగివచ్చి మొత్తం కాన్వాయ్‌ను కాకుండా, కేవలం బాలయ్య వాహనాన్ని మాత్రమే గ్రామంలోకి వెళ్లనిచ్చారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, గ్రామాలో పగలు, ప్రతీకారాలు రేపే విధంగా వైకాపా నేతలు, కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నామన్నారు. మరోమారు తమ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments