Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... జగన్ నడుస్తున్న దారి నాకు ఏమీ నచ్చడంలేదు, వైకాపాకు గుడ్‌బై చెప్పిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (16:38 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి షాకులు మొదలయ్యాయి. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తేరుకోలేని షాకిచ్చారు. పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గుంటూరులో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, గుంటూరు లోక్‌సభ వైకాపా ఇన్‌చార్జ్ కిలారి రోశయ్య తీవ్ర విమర్శలు చేశారు. 
 
'వైకాపా కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తుంది. కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు ఉండదు. ఉమ్మారెడ్డి అనుభవాన్ని వినియోగించుకోలేదు. మండలిలో ప్రతిపక్ష నేత విషయంలో కనీసం చర్చించలేదు. మండలిలో చైర్మన్ అన్నారు. ప్రతిపక్ష నేతగా కూడా ఉమ్మారెడ్డికి అవకాశం ఇవ్వలేదు. గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా తనను నిలబెట్టారు. కొందరు మానసికంగా కుంగదీశారు. ఎన్నికల తర్వాత కూడా వారి ఇష్టాలతోనే పార్టీ నడుపుతున్నారు. వైకాపాలో నేను కొనసాగలేను' అని రోశయ్య స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments