Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తుగా ఓడిపోవడానికి గోతులే ప్రధాన కారణం: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

వరుణ్
ఆదివారం, 7 జులై 2024 (08:01 IST)
గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ముఖ్యంగా తాను భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడానికి ప్రధాన కారణం రహదారులపై ఉన్న గోతులే ముఖ్య కారణమని, వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు. ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమికి గల కారణాలను వెల్లడించారు. ఎన్నికల్లో తన ఓటమికి రహదారి గోతులే కారణమన్నారు. ఎన్నికలకు ముందు ఈ విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. గత ఐదేళ్ల పాలనలో అనేక తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ప్రజలు ఓటర్లు తమను చిత్తుగా ఓడించారని చెప్పారు.
 
తన నియోజకవర్గ అభివృద్ధి కోసం సొంత నిధులను రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేశామని, ఇపుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఆ నిధులను మంజూరు చేస్తుందో లేదో తెలియదన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో తెలిసో తెలియకో పలు తప్పులు చేశామని, ఈ కారణంగా ప్రజలు తమను అధికారానికి దూరంగా ఉంచారని తెలిపారు. ఇపుడు టీడీపీ, జనసేన, బీజేపీ పాలకులు ఇవే తప్పులు చేసి ప్రజల ఆగ్రహానికి గురికావొద్దని ఆయన హితవు పలికారు. 
 
అలాగే, వైకాపా సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులకు ఒకటే చెబుతున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే స్వాగతం పలికి వారితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. అయితే, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేకపోతే వెళ్ళడం వెళ్లకపోవడం అనేది మీ వ్యక్తిగత విషయమని కరణం ధర్మశ్రీ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments